ట్రూజెట్‌ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

ట్రూజెట్‌ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

కడప నుంచి విజయవాడకు వెళుతున్న ట్రూజెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అయిన వెంటనే విమానానికి ఓ పక్షి అడ్డురావడంతో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ల్యాండ్ చేశాడు. అయితే అత్యవసరంగా ల్యాండ్ అవడంతో విజయవాడ వెళ్లాల్సిన ఆ విమానాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే విమానం విజయవాడ వెళ్లి వచ్చి చెన్నై వెళ్లాల్సి ఉంది. అధికారులు ఈ రెండు సర్వీసులను రద్దు చేశారు. ప్రత్యామ్నాయ ప్రయాణానికి ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానంలో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం 110 మంది ప్రయాణికులు ఉన్నారు.

.