ESI స్కాం : ఈడీ సోదాల్లో 3 కోట్ల నగదు సీజ్

ESI  స్కాం : ఈడీ సోదాల్లో 3 కోట్ల నగదు సీజ్

ఈఎస్ఐ స్కాంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నాయిని మాజీ పీఎస్ ముకుంద రెడ్డి, దేవికారాణి, ఇతర నిందితులకు సంబంధించి మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో భారీగా నగదు, ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. భారీగా నోట్ల కట్టలు, కోటికి పైగా విలువైన నగలు, బ్లాంకు చెక్కులు, ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్ చేశారు. నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. నాయిని మాజీ పీఎస్ ముకుంద రెడ్డి బంధువు వినయ్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు, నగలు సీజ్ చేశారు.