ప్రియురాలని గొంతు కోసి హత్య

ప్రియురాలని గొంతు కోసి హత్య

పెద్దపల్లి జిల్లా: పెళ్లికి నిరాకరించందని ప్రియురాలని గొంతుకొసి హత్య చేశాడు ఓ యువకుడు. పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్.. కెకె నగర్ లో ఈ ఘటన జరిగింది. కెకె నగర్ కు చెందిన అంజలి, తారకరామారావు నగర్ కు చెందిన రాజు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అంజలిని పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా రాజు వేధిస్తుండటంతో.. రెండు సార్లు పంచాయతీ కూడా జరిగింది. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజు వచ్చి అంజలిని కత్తిపీటతో గొంతు కోసి పరారైనాడు. అంజలి స్పాట్ లోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.