హైదరాబాద్లో వరుసగా 4 ఫ్లాట్లలో చోరీ

హైదరాబాద్లో వరుసగా 4 ఫ్లాట్లలో చోరీ

హయత్ నగర్ పీఎస్ పరిధిలోని కుంట్లుర్ ప్రజయ్ గల్మోహర్ లో వరుసగా 4 ఫ్లాట్లలో చోరీ జరిగింది. తెల్లవారు జామున 3 గంటల సమయంలో గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఎంటర్ అయి చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఒకరి ఫ్లాట్ లో సుమారు 8 తులాల బంగారం, 800 గ్రాముల వెండి, నగదు దోచుకెళ్లారు. మిగతా ఫ్లాట్లలో ఎంత దోచుకెళ్లారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగతనానికి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది కూడా ఈ ఏరియాలో చెడ్డి గ్యాంగ్ దోపిడికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే దోపిడికి పాలడ్డారని చెబుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.