అల్వాల్ ప్రెసిడెన్సీ కాలనీలో చోరీ

అల్వాల్ ప్రెసిడెన్సీ కాలనీలో చోరీ

అల్వాల్ ప్రెసిడెన్సీ కాలనీలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రూ.80 వేలు క్యాష్ దొంగిలించినట్టు తెలుస్తోంది. ఇంటికి నిప్పు పెట్టి, కారం చల్లి దొంగల ముఠా పారిపోయిన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తండ్రి సంవత్సరికం కోసం దిల్ సుఖ్ నగర్ కు వెళ్ళిన బంగారు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరి చేసి నిప్పంటించారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు.. దొంగతనం చేసి, ఇంట్లో ఉన్న రూ.80 వేల  నగదును అపహరించారు.

దొంగతనం చేసే క్రమంలో ఇంట్లో కారంపొడి చల్లి, ఇంటికి నిప్పంటించి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తుండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇంటికి నిప్పంటించడంతో రెండో అంతస్తులో ఉన్న సామగ్రి పూర్తిగా కాలి బూడిదైంది.