బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో చోరీ

బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో చోరీ

బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంలో భద్రతా వైఫల్యం బయటపడింది. నిర్మాణంలో ఉన్న ఈ భవనంలో చోరీ జరిగింది. సుమారు 38  కాపర్ బండిల్స్ చోరీ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రాజెక్టు మేనేజర్ సురేష్ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భవనంలో పనిచేస్తున్న సిబ్బందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్ లోని ప్రతి ప్రాంతంపై అనువనువు నిఘా పెట్టేందుకు, ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో పసిగట్టేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మిస్తున్నారు.