
గచ్చిబౌలి, వెలుగు: ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రపోజల్స్మారిస్తే అభివృద్ధి జరగదని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి పీఎస్కు తరలించారు.
ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్వరకు మెట్రో రైల్ విస్తరిస్తే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. కక్ష సాధింపు కోసమే సీఎం రేవంత్రెడ్డి మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్ట్ను అడ్డుకున్నారని ఆరోపించారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.