దొంగల బీభత్సం.. కాపు కాసి హెడ్‌మాస్టర్ కుటుంబంపై దాడి

దొంగల బీభత్సం.. కాపు కాసి హెడ్‌మాస్టర్ కుటుంబంపై దాడి

వికారాబాద్ జిల్లా హుమ్నాబాద్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. కుటుంబ స‌మేతంగా కారులో వెళుతున్న ఓ హెడ్ మాస్ట‌ర్ పై దాడి చేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల ఉన్న‌త పాఠ‌శాల ప్రధానోపాధ్యాయుడు.. త‌న‌ కుటుంబంతో కలిసి కారులో షిర్డీ వెళ్తుండ‌గా.. ఇదే అదనుగా భావించిన దొంగలు… రోడ్డుకి అడ్డంగా మేకులు వేశారు. దీంతో కారు పంక్చర్ బోల్తా పడింది. ఆ తర్వాత దొంగలు హెడ్‌మాస్టర్ రాములు కుటుంబంపై దాడి చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, నగలు అపహరించుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం హెడ్ మాస్టర్ కుటుంబం.. హుమ్నాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.