14 తులాల గోల్డ్, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

14 తులాల గోల్డ్, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

శంషాబాద్, వెలుగు: దోపిడీ దొంగలు తాళం వేసిన ఇంట్లో 14 తులాల బంగారం, కొంత డబ్బు ఎత్తుకెళ్లిన ఘటన మైలర్ దేవ్ పల్లి పీఎస్ పరిధి లక్ష్మిగూడ రాజీవ్ గృహకల్ప ఫేజ్ – 2  బ్లాక్ నంబర్ 9లోని రూమ్.5లో  మంగళవారం జరిగింది. ఇంటి ఓనర్ రామ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు, క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.