కళ్లలో కారం చల్లి.. గొలుసు చోరీకి యత్నం

కళ్లలో కారం చల్లి.. గొలుసు చోరీకి యత్నం

ఒకే రోజు రెండు చోట్ల గొలుసు దొంగల చేతి వాటం చూపుపించారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్ లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి మెడలో ఉన్న బంగారు గొలుసులు దొంగలించే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి ప్రతిఘటించడంతో మెడలో నుంచి దొంగలించే ప్రయత్నం చేసిన బంగారు గొలుసును వదిలేసి పారిపోయారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

కేపీహెచ్ బీ కాలనీలోని ధనలక్ష్మి సెంటర్ దగ్గర 2024 మార్చి 13 బుధవారం తెల్లవారు జామున  మల్లవ్వ (62) అనే మహిళ వాకింగ్ చేసుకుంటూ వెళుతుంది. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియని దుండగుడు మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్ బీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.