లాక్ డౌన్ రూల్స్ ను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు: కేంద్రం

లాక్ డౌన్ రూల్స్ ను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు: కేంద్రం

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే కొందరు దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర  హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సూచిస్తూ జాబితాను రాష్ట్రాలకు పంపారు. లాక్‌డౌన్‌ అమలును ఉల్లంఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద…జరిమానాతో పాటు.. రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని తెలుపుతూ సవివరమైన నిబంధనల లిస్టును కేంద్ర ప్రభుత్వం పంపింది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది.