కుత్బుల్లాపూర్ భౌరంపేటలోని ఇద్దరు స్టూడెంట్స్పై లైంగిక దాడి

కుత్బుల్లాపూర్ భౌరంపేటలోని ఇద్దరు స్టూడెంట్స్పై లైంగిక దాడి

కుత్బుల్లాపూర్, వెలుగు: కుత్బుల్లాపూర్​భౌరంపేటలోని మైనారిటీ రెసిడెన్షియల్​స్కూల్​లో చదువుకునే ఇద్దరు బాలురిపై అక్కడే చదువుకునే ముగ్గురు కాలేజీ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. 

నాలుగు రోజుల కింద ఈ ఘటన జరగ్గా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు ముందు భయపడి ఎవరికీ చెప్పలేదని, శనివారం ఇంటికి వెళ్లగా అక్కడ వారి తల్లిదండ్రులకు చెప్పడంతో ఫిర్యాదు చేశారని దుండిగల్​పోలీసులు తెలిపారు.