చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి సమీపంలోని బండకిందపల్లి దగ్గర ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు.

మదనపల్లి నుంచి అదే మండలంలోని అడవిపల్లె గ్రామానికి  ప్రయాణికులతో ప్రైవేటు బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో అడవిపల్లె గ్రామ పరిధిలో ఉన్న జ్యూస్‌ ఇండస్ట్రీ దగ్గరకు రాగానే రాళ్లను ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మండలంలోని ఎర్రబల్లికి చెందిన గంగులప్ప (65), బండకడపల్లికి చెందిన సోమునాయుడు (19), అడవిలోపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున (29) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.