చెన్నై: తమిళనాడులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వయంపట్టి ప్రాంతంలోని క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలియగానే విరుధునగర్ జిల్లా కలెక్టర్ మేఘనాథ్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది, దానికి గల కారణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tamil Nadu: Three people died in a fire at a cracker manufacturing unit in Vaiyampatti area of Virudhunagar district, says District Collector Meghanath Reddy
— ANI (@ANI) January 5, 2022
(Visuals from the spot) pic.twitter.com/fXg04uhfDS
మరిన్ని వార్తల కోసం: