అగ్ని ప్రమాదంలో ముగ్గురి మృతి

అగ్ని ప్రమాదంలో ముగ్గురి మృతి

చెన్నై: తమిళనాడులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వయంపట్టి ప్రాంతంలోని క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలియగానే విరుధునగర్ జిల్లా కలెక్టర్ మేఘనాథ్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది, దానికి గల కారణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తల కోసం: 

బూస్టర్ డోసుగా చుక్కల మందు టీకా!

నిరాశలో ప్రభాస్ అభిమానులు

సిటీలో ఆర్టీసీ బస్సుల కొరత