ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు మృతి

ఎన్ కౌంటర్  లో  ముగ్గురు మావోలు మృతి

ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. టేకులగూడెం – చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో..... పోలీసులు – మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని.. మూడు ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.