కిడ్నీ రాకెట్‌ కేసుపై త్రిసభ్య కమిటీ విచారణ

కిడ్నీ రాకెట్‌ కేసుపై త్రిసభ్య కమిటీ విచారణ

విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రద్ధ ఆసుపత్రి కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై  నేడు విచారణ జరగనుంది. జిల్లా కలెక్టర్‌ నియమించిన త్రిసభ్య కమిటీ నేటి నుంచి ఈ విచారణ చేపట్టనుంది. అందులో భాగంగా  హాస్పిటల్‌ యాజమాన్యాన్ని గత ఐదేళ్లుగా జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లపై ఎంక్వయిరీ చేయనుంది.

ఈ ఏడాదిలోనే శ్రద్ధ హాస్పిటల్‌ 15 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసింది. త్రిసభ్య కమిటీ విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆసుపత్రిలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న ట్రాన్స్‌ప్లాంట్స్‌, లైవ్‌, బ్రెయిన్‌ డెత్‌ కేసులు ఎన్ని… బ్రెయిన్‌ డెత్‌ కేసులకు సంబంధించిన సమాచారాన్ని జీవన్‌దాన్‌కు ఇస్తున్నారా…లైవ్‌ కేసులకు సంబంధించిన వివరాలను డీఎంఈ ఆఫీస్‌కు ఇచ్చారా.. వాటికి సంబంధించిన అనుమతులు సంబంధించిన అంశాలను కమిటీ విచారణ జరుపనుంది.