కృష్ణా నది లో ముగ్గురు గల్లంతు.. ఇద్దరిని కాపాడిన స్థానికులు

కృష్ణా నది లో ముగ్గురు గల్లంతు.. ఇద్దరిని కాపాడిన స్థానికులు

జోగులాంబ గద్వాల: కృష్ణా నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. వెంటనే గుర్తించిన స్థానికులు ఇద్దరిని కాపాడగా.. మరో మహిళ కనిపించకుండా పోయింది. జోగుళాంబ గద్వాల జిల్లా.. అగ్రహరం వద్ద కృష్ణా నది లో జరిగిందీ ఘటన. కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు తమ నిత్యావసరాల కోసం పుట్టిలో రాకపోకలు సాగిస్తుంటారు.ఇదే క్రమంలో అగ్రహారం గ్రామం వద్ద ముగ్గురు ప్రమాదవశాత్తు నదిలో పడిపోవడం స్థానికంగా ఉన్న వారు చూసి కేకలు వేయడంతో.. పుట్టి నడిపేవారు గుర్తించి ఇద్దరిని కాపాడారు. మరో మహిళను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆమె కనిపించకుండా సోయింది. స్థానికులు మరికొందరు గజ ఈతగాళ్లు ఒడ్డున ఉన్న పుట్టి తీసుకుని మహిళ కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన మహిళ ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గల్లంతైన మహిళ ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో.. ఒడ్డున వాహనాల్లో గస్తీ చేపట్టారు.