వేటగాళ్ల ఉచ్చులకు మూగజీవాలు బలవుతున్నాయి. మంగళవారం ఓ మచ్చల జింక మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్ పల్లి సమీపంలో జరిగింది. గున్గల్ రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో ఉన్న మామిడితోట దగ్గర అడవిపందులకు భిగించిన ఉచ్చుల్లో సుమారు మూడేళ్ల వయస్సుగల మచ్చల జింక పడి మృతి చెందింది. ఇది గమనించిన వేటగాళ్లు ఆ జింకను అటవీప్రాంతంలోకి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భయపడిన వేటగాళ్లు మచ్చల జింకను గుంత తీసి పాతిపెట్టి పరారయ్యారు. దీంతో పోలీసులు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఫారెస్టులో గాలించి మచ్చల జింకను పాతిపెట్టిన చోటును గుర్తించారు. మచ్చల జింకను వెలికితీసి పోస్టుమర్టం నిర్వహించారు. వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు అటవిశాఖ రేంజ్ అధికారి విష్ణువర్ధన్ . నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
వేటగాళ్ల ఉచ్చుకు జింక బలి
- తెలంగాణం
- April 10, 2019
మరిన్ని వార్తలు
-
ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
-
కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
-
Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
-
IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
లేటెస్ట్
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
- దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్
- Janaganamana: చివరికి తేజ సజ్జ చేతికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పటికైనా వర్కౌట్ అయ్యేనా!
- ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన