ఇన్నాళ్లూ పడిన బాధలు చాలు.. మీకు నేనున్నా

ఇన్నాళ్లూ పడిన బాధలు చాలు.. మీకు నేనున్నా

వాషింగ్టన్: అమెరికా ప్రజలు ఇన్నాళ్లూ భరించిన నొప్పిని మటుమాయం చేసే సమయం ఆసన్నమైందని అగ్రరాజ్యానికి కాబోయే ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ప్రజలు పడిన బాధలు ఇక చాలని, వారికి అండగా నిలుద్దామంటూ మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు. అమెరికా ప్రజలు తనకు గొప్ప విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. ‘దేశ ప్రజలు మనకు అద్భుతమైన విజయాన్ని అందించారు. దేన్నయినా విడదీసేలా కాకుండా కలిపేందుకు ఉంచే ప్రెసిడెండ్‌‌లా ఉంటానని మీకు మాటిస్తున్నా. ఇప్పుడు అందరం ఒకరికొకరం అవకాశాలు ఇచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకరు చెప్పేది మరొకరు వినాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అమెరికా పడిన బాధలను, నొప్పిని మటుమాయం చేద్దాం’ అని విల్మింగ్టన్‌‌లో విక్టరీ స్పీచ్‌‌లో బైడెన్ అన్నారు.