- తెలంగాణలో కాంగ్రెస్ కు 8 నుంచి 10.. బీజేపీకి 4 నుంచి 6 సీట్లు
- టైమ్స్ నౌ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 378 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే శుక్రవారం వెల్లడించింది. ఇండియా కూటమికి 120, ఇతరులకు 45 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ కు 2 నుంచి 4, బీజేపీకి 4 నుంచి 6, కాంగ్రెస్ కు 8 నుంచి 10 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి 21 నుంచి 22 సీట్లు వస్తాయని పేర్కొంది.