శ్రీవారి కొండ కిటకిట... స్వామి దర్శనానికి 24 గంటలు

శ్రీవారి కొండ కిటకిట... స్వామి దర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది.తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో భక్తులువేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

కాగా శనివారం( జూన్ 17)  శ్రీవారిని 87,762 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 43,753 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.