రెండు మ్యాచ్‌‌లూ  రా.7.30కే

రెండు మ్యాచ్‌‌లూ  రా.7.30కే

నేడు హైదరాబాద్‌‌తో ముంబై, ఢిల్లీతో బెంగళూరు ఢీ
అబుదాబి/షార్జా:  ఐపీఎల్‌‌ 14వ సీజన్‌‌ లీగ్‌‌ దశ ముగిసే చివరి రోజు, శుక్రవారం సరికొత్త అనుభూతి ఇవ్వనుంది. నేడు రెండు మ్యాచ్‌‌లు ఒకే టైమ్‌‌లో జరగనున్నాయి. అబుదాబిలో హైదరాబాద్‌‌తో ముంబై, దుబాయ్‌‌లో బెంగళూరుతో ఢిల్లీ తలపడుతాయి. ఐపీఎల్‌‌ హిస్టరీలో తొలిసారిగా రెండు మ్యాచ్‌‌లు రాత్రి ఏడున్నరకే  స్టార్ట్‌‌ అవుతాయి. డబుల్‌‌ హెడర్‌‌లో తొలి పోరు 3.30కే మొదలవ్వాల్సి ఉన్నా.. బీసీసీఐ ప్రయోగాత్మకంగా రెండింటినీ ఒకే టైమ్​లో నిర్వహిస్తోంది.