న్యూఢిల్లీ: టో క్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్తో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను దేశ కీర్తిని చాటింది. ఈ గెలుపు ద్వారా ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గిన దేశ తొలి మహిళా వెయిట్ లిప్టర్గా మీరాబాయి రికార్డు సృష్టించింది. మెడల్ నెగ్గిన తర్వాత మీరాబాయి చానూ తనకు పిజ్జా, ఐస్క్రీమ్ తినాలని ఉందని చెప్పింది. ఈ రెండూ తన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అని, వీటిని తిని చాలా నెలలైందని తెలిపింది. దీంతో ఆమెకు పిజ్జా తినిపించడానికి ప్రముఖ రెస్టారెంట్ డోమినోస్ రెడీ అయ్యింది.
Aapne kaha, aur humne sunn liya ?
— dominos_india (@dominos_india) July 24, 2021
We never want @mirabai_chanu to wait to eat ? again so we’re treating her to FREE Domino’s pizza for life! #PizzasForLife
మీరాబాయికి జీవితాంతం పిజ్జా ఫ్రీగా ఇస్తామంటూ డోమినోస్ ప్రకటించింది. ‘దేశానికి మెడల్ అందించినందుకు మీకు కంగ్రాట్స్. కోట్లాది మంది ప్రజల కలల్ని మీరు నెరవేర్చారు. జీవితాంతం మీకు ఫ్రీగా పిజ్జాలు అందిస్తాం’ అని డోమినోస్ ట్వీట్ చేసింది.