ఒలింపిక్స్  హాకీలో టీమ్  ఇండియా శుభారంభం

ఒలింపిక్స్  హాకీలో టీమ్  ఇండియా శుభారంభం

ఒలింపిక్స్  హాకీలో టీమ్  ఇండియా శుభారంభం చేసింది. పురుషుల హాకీలో న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. 3-2 తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. హర్మన్ ప్రీత్  సింగ్  రెండు గోల్స్  చేశాడు. రూపిందర్  పాల్  సింగ్  మొదటి గోల్  సాధించాడు. మ్యాచ్  మొదలైన ఆరో నిమిషంలోనే న్యూజిలాండ్  1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐతే పదో నిమిషంలో రూపిందర్  గోల్  కొట్టి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 26వ నిమిషంలో హర్మన్  ప్రీత్  గోల్  కొట్టి టీమ్  ఇండియాను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కోర్టు మారగానే మరోసారి హర్మన్ ప్రీత్  33వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలవడంతో భారత్  3-1తో అధిపత్యంలోకి దూసుకెళ్లింది. మరో 10 నిమిషాల టైంలోనే స్టీఫెన్  జోసెఫ్  గోల్  కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ స్కోర్  2-3కు చేరింది. తర్వాత మ్యాచ్ లో ఆసీస్  తో భారత్ రేపు  తలపడనుంది.