డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన రానా

డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన రానా

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ED విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు హీరో దగ్గుబాటి రానా. మనీలాండరింగ్ వ్యవహారంలో రానాను విచారించనున్నారు అధికారులు. ఆడిటర్స్, అడ్వకేట్స్ తో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రానా. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలను ఈడీ పరిశీలించనుంది. గతంలో 2017లో జరిపిన ఎక్సైజ్ విచారణలో రానా, రకుల్ పేర్లు వినిపించలేదు. అయితే డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో వీరిద్దరికి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ఈడీ ముందు హాజరవ్వగా....ఇవాళ హీరో రాణాను అధికారులు విచారిస్తున్నారు. కెల్విన్ తో ఉన్న పరిచయాలు, F క్లబ్ గురించి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. 

డ్రగ్స్  కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ చార్మి, రకుల్, నటుడు నందును ఈడీ విచారించింది. రేపు హీరో రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్ ను విచారించనున్నారు అధికారులు. ఇప్పటికే వీరి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అధికారులు.... బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. మరోవైపు రానాతో పాటు ఇవాళ నటి ముమైత్  ఖాన్ ని సైతం అధికారులు విచారించే అవకాశం ఉంది.