హాట్ టాపిక్గా దిల్ రాజు, కేసీఆర్ భేటీ

హాట్ టాపిక్గా దిల్ రాజు, కేసీఆర్ భేటీ

టాలీవుడ్  నిర్మాత దిల్ రాజు మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు.  దిల్ రాజు తన సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు అశిశ్ రెడ్డి వివాహానికి రావాలని కేసీఆర్ ను  ఆహ్వానించారు.  పెళ్లి కార్డు ఇచ్చి మ్యారేజ్ కు   రావాల్సిందిగాకోరారు. ఇటీవల మోకాలు సర్జరీ కావడంతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. 

దిల్ రాజు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.  కాంగ్రెస్  నుంచి  నిజామాబాద్ ఎంపీకి  పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.  ఇటీవల దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 

 కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దిల్ రాజు గాంధీ భవన్ లో ఎలాంటి అప్లికేషన్ ఇవ్వలేదు.  ఇప్పటికే  తన సొంత జిల్లాలో మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ పేరిట తన స్వగ్రామం నర్సింగ్ పల్లితో పాటు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు చేస్తోంది దిల్ రాజు ఫ్యామిలీ. నిజామాబాద్  టికెట్ కోసం కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి, ఈరవతి అనిల్, ఆకుల లలిత పోటీకి రేసులో  ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి చాన్స్ ఇస్తుందనేది చూడాలి.