ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వరంగల్ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచిన వాహనాలు

ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వరంగల్ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచిన వాహనాలు

ఉప్పల్, వెలుగు: ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఆదివారం భారీగా ట్రాఫిక్​జామ్ అయింది. మేడిపల్లి నుంచి ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు వరకు రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

రాఖీ పౌర్ణమి, మిలాద్ ఉన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నబీ, వీకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర వరుస సెలవులతో సొంతూళ్లకు వెళ్లిన జనం.. మళ్లీ సిటీబాట పట్టడంతో వరంగల్ వైపు నుంచి ట్రాఫిక్ పెరిగింది.

దీంతో పాటు ఆదివారం కావడంతో స్వర్ణగిరి, యాదగిరిగుట్ట ఆలయాలకు వెళ్లిన జనంతో ట్రాఫిక్ పెరిగింది. మరోవైపు ఫ్లైఓవర్ పనులు జరుగుతుండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది.