
హైదరాబాద్, వెలుగు: సిటీ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. 53 మందిని ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్స్ ఇస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలు వెలువడిన వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో పోస్టింగ్ తీసుకోవాలని సూచించారు. బంజారాహిల్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్వో) పోలిశెట్టి సతీశ్ను ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ కెఎం రాఘవేంద్రను నియమించారు. జూబ్లీహిల్స్ ఎస్హెచ్వోగా కె. కోటేశ్వర్ రెడ్డి, చిలకలగూడకు పి. ప్రవీణ్, సైఫాబాద్ పి. రాఘవేందర్, అఫ్జల్గంజ్ కె. హరిభూషణ్ రావు, ఫిల్మ్నగర్కు శ్రీనివాసులు, బేగంపేటకు చిర్రా రమేష్ సహా ఎస్బీ, ట్రాఫిక్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ ఇచ్చారు.