సిటీ కమిషనరేట్ లో 53 మంది ఇన్​స్పెక్టర్ల బదిలీ

సిటీ కమిషనరేట్ లో 53 మంది ఇన్​స్పెక్టర్ల బదిలీ

హైదరాబాద్, వెలుగు: సిటీ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్​స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. 53 మందిని ట్రాన్స్​ఫర్ చేసి పోస్టింగ్స్ ఇస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలు వెలువడిన వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో పోస్టింగ్ తీసుకోవాలని సూచించారు. బంజారాహిల్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్​హెచ్​వో) పోలిశెట్టి సతీశ్​ను ఎస్ఆర్ నగర్ ఇన్​స్పెక్టర్​గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఐటీ సెల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెఎం రాఘవేంద్రను నియమించారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్​హెచ్​వోగా కె. కోటేశ్వర్ రెడ్డి, చిలకలగూడకు పి. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి. రాఘవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అఫ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె. హరిభూషణ్ రావు, ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్​కు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసులు, బేగంపేటకు చిర్రా రమేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సహా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లకు పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.