మందమర్రి, వెలుగు: ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ చూపి వందలాది మంది యువతులను ట్రాప్ చేశాడో కేటుగాడు. ఉట్నూర్ మండలం సాంపూర్కు చెందిన కునమల్ల శ్రీనివాస్ కలెక్టర్ సీసీనంటూ పరిచయం చేసు కుని ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, యువతులు, మహిళలకు ఉద్యోగం ఇప్పిస్తానని, పర్మనెంట్ చేయిస్తానని నమ్మించి.. న్యూడ్ ఫోటోలు పంపాలని, వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలనేవాడు.
ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండువేల మంది అతని ప్రలోభాలకు గురయ్యారు. ఆ తర్వాత రికార్డు చేసిన ఫోటోలు, వీడియోల ద్వారా బ్లాక్మొయిల్కు పాల్పడేవాడు. మందమర్రికి చెందిన ముగ్గురు మహిళలు షీ టీం దృష్టికి తీసుకవెళ్లగా మందమర్రి పోలీసులు శ్రీనివాస్ను పట్టుకున్నారు.