త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు 980 కిలోల పైనాపిల్స్ను పంపారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, పిబి జమాటియా 2023 జూలై 08 శనివారం చిట్టగాంగ్లోని అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియాలోని అధికారులకు ప్రత్యేకంగా తెప్పించిన 'క్యూ' రకం పైనాపిల్స్తో కూడిన 100 బాక్సులను పంపారు. మీకు బహుమతిగా వీటిని పంపడం గౌరవంగా ఉందని జమాటియా తెలిపారు. 2023 జూన్ 15న హసీనా 500 కిలోల మామిడి పండ్లను ముఖ్యమంత్రికి పంపారు.