తెలంగాణ ప్రభుత్వంపై కేందమంత్రి ఫైర్

తెలంగాణ ప్రభుత్వంపై కేందమంత్రి ఫైర్

టీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలను నిర్లక్ష్యం చేస్తోందని కేందమంత్రి బీఎల్ వర్మ అన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ద్వారా వేల ఉద్యోగాలు కల్పిస్తామని ..తెలంగాణ ప్రభుత్వం..పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  ఒక్క పరిశ్రమలే కాదు..తెలంగాణ సర్కారు అన్ని రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మడికొండ వీవర్స్ సోసైటీ సభ్యులు విన్న వించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బీఎల్ వర్మ హామీ ఇచ్చారు.

ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సాహం..
దేశంలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్రమంత్రి బీఎల్ వర్మ అన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.