హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవడం అసాధ్యం

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవడం అసాధ్యం

తెలంగాణ రాష్ట్రంలో TRS పార్టీ పతనం ప్రారంభమైందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆ పార్టీ ఓటమి ఖాయమన్నారు. ఈటల రాజేందర్ ఘన విజయం సాధించబోతున్నట్లు తేల్చి చెప్పారు. తలకిందులగా తపస్సు చేసినా హుజూరాబాద్ లో TRS గెలవలేదని స్పష్టం చేశారు.

ఈటల రూపంలో తెలంగాణలో బీజేపీకి మరో ఎమ్మెల్యే పెరగనున్నట్లు తెలిపారుడీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ తీరుతో తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ మద్దతుతోనే కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతోందని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా వాసులను కేసీఆర్ కాళ్లతో తంతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.