టీఆర్ఎస్ కమ్యూనల్ పార్టీ : MP ధర్మపురి అర్వింద్

టీఆర్ఎస్ కమ్యూనల్ పార్టీ : MP ధర్మపురి అర్వింద్

టీఆర్ఎస్ ఒక వర్గానికే పరిమితం అయిందనీ.. దానిని కమ్యూనల్ పార్టీ అన్నా తప్పులేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌ లో ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అందరికోసం పనిచేస్తుందన్నారు. కార్మికులకు, హిందువులకు, రైతులకు, ఉద్యోగస్తులకు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. నిజామాబాద్ ప్రాంత నీటిని సిద్ధిపేటలోని గడీలకు తరలించే గడీల పాలన కొనసాగుతుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం అండగా ఉంటుందని.. ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే స్వాగతిస్తామని సహకారం అందిస్తామని అన్నారు. ఫ్యాక్టరీ కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.