కరీంనగర్: జీహెచ్ఎంసీలో సెంచరీ కొట్టి సత్తా చాటుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్లో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జీహెచ్ఎంసీలో పోలింగ్ శాతం తగ్గడానికి కారణం టీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించడం హస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్దిని ప్రశ్నించడం మాని కేంద్రం నుంచి రావల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని హితవు పలికారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. కరీంనగర్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి హామీని నెరవేరుస్తామన్నారు. కరీంనగర్ పాత బజార్ శివాలయంలో పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని కవిత అన్నారు.