సంక్రాంతి సందర్భంగా రెండకరాల స్థలంలో వేసిన కారు ముగ్గు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరిసిల్ల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లో టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలతో పాటు మంత్రి కేటీఆర్ కు చెందిన ఓ టీమ్ ఈ ముగ్గు ని వేశారు. డ్రోన్ ల సహాయంతో ఆ ముగ్గు ను లాంగ్ షాట్ నుంచి ఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా వేసిన ఈ ముగ్గు విశేషంగా ఆకర్షిస్తోంది. 200 మంది మహిళలు ఈ ముగ్గును వేశారు. కారు మధ్యలో KCR అనే అక్షరాలతో సీఎం కేసీఆర్ పై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో సిరిసిల్ల ను అభివృద్ధి చేయడంతో కారు గుర్తు ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని, అందుకు గుర్తుగా ఈ ముగ్గును వేశామని అక్కడి మహిళలు తెలిపారు.
Siricilla TRS women activists created a visual treat, colorful Rangoli in over 2 acres at Siricilla in support of TRS .
200 women participated in the making of this visual wonder. #TRSSweepsMunicipolls @KTRTRS @RaoKavitha pic.twitter.com/oUqjUcaV51— Jagan Patimeedi (@JAGANTRS) January 14, 2020