
హైదరాబాద్, వెలుగు: డిప్లొమా ఇన్ ఎలి-మెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ ఈ) కోర్సుల లో ప్రవేశానికి నిర్వహించే డీసెట్-– 2019 దరఖాస్తుకు ఏప్రిల్ 4 వరకు చాన్స్ ఉందని డీసెట్ కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి సోమవారం తెలిపారు. ఈనెల 11 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇప్పటివరకు 6,200 అందాయన్నారు. మే 22న ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుం దని తెలిపారు. రాష్ట్రంలో 208 డీఈ డీ కాలేజీల్లో 11,550 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా కోర్సులలో ప్రవేశపరీక్ష ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామనిఆయన చెప్పారు.