కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటర్మీడియట్ సిలబస్ను 70 శాతానికి తగ్గింది. దీంతో ఇంటర్ పరీక్షల క్వశ్చన్ పేపర్లలో స్వల్ప మార్పులు చేశారు. దీనికి సంబంధించి ఇంటర్ మోడల్ పేపర్స్ను తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TSBIE) విడుదల చేసింది. అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించారు బోర్డు అధికారులు. రెండు మార్కుల ప్రశ్నలు 10కి పది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నల్లో మార్పులు చేశారు. మోడల్ పేపర్స్ కోసం tsbie.cgg.gov.in వెబ్సైట్ను లాగిన్ అవ్వాల్సిందిగా తెలిపారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మే 1 నుంచి 19 వరకు ఫస్ట్ ఇయర్, మే 2 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు.