జూన్ 29 తేదీన గురువారం టీఎస్ ఐ-సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి వెల్లడించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనెజ్మెంట్ సెమినార్ హాలులో మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఐసెట్ ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష మే 26, 27 తేదీల్లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని 20 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తెలంగాణలోని 16 కేంద్రాలు, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు.