ఎయిర్​పోర్టు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ​ఆఫర్​

ఎయిర్​పోర్టు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ​ఆఫర్​

హైదరాబాద్​లోని ఎయిర్​పోర్టులకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్​ ఆర్టీసీ) బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులలో కనీసం ముగ్గురు కలిసి జర్నీ చేస్తే టిక్కెట్లపై సబ్సిడీ లభిస్తుందని తెలిపింది. 

మూడు అంతకు మించి ఎందరు ఎందరు ప్రయాణించినా టికెట్ట్​పై మొత్తం ఛార్జీల్లో 10శాతం వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్​ రీజనల్​ మేనేజర్​ వెంకన్న తెలిపారు. కుటుంబాలతో కలిసి ఎయిర్​పోర్టుకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఖర్చు తగ్గించడం కోసం ఈ సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పారు. క్యాబ్​లు, ఇతర ప్రైవేటు వాహనాల పోటీని ఎదుర్కోవడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

ప్రస్తుతం పలు రూట్లలో ఎయిర్​పోర్టుకు చేరుకోవడానికి కనిష్ఠంగా రూ.50 నుంచి గరిష్ఠంగా రూ.300 వరకు టికెట్​ఛార్జీలు ఉన్నాయి.  త్వరలో మరికొన్ని 20 ఏసీ బస్సులను ఎయిర్​పోర్టుకు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.