తుంగభద్ర ట్రైన్​కు తప్పిన పెను ముప్పు 

తుంగభద్ర ట్రైన్​కు తప్పిన పెను ముప్పు 

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్​లో గురువారం సాయంత్రం తుంగభద్ర రైలు ఇంజిన్..​బోగీలు లేకుండానే ముందుకు వెళ్లింది. కర్నూల్ నుంచి హైదరాబాద్  వెళ్లాల్సిన తుంగభద్ర ఎక్స్​ప్రెస్​ సాయంత్రం గద్వాల రైల్వేస్టేషన్​కు వచ్చి ఆగింది. తిరిగి వెళ్లే క్రమంలో ఇంజిన్ కు, బోగీలకు మధ్య ఉండే లూప్ లాక్ తెగిపోవడంతో ఇంజిన్​ఒక్కటే దాదాపు 50 మీటర్ల వరకు వెళ్లింది.  

గమనించిన లోకో పైలట్​ మళ్లీ ఇంజిన్​ను వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. కొద్దిసేపటికి బోగీలకు తగిలించుకొని లూప్ లాక్ సరిచేసుకొని తిరిగి తీసుకువెళ్లారు. ట్రైన్ ఫాస్ట్ గా వెళ్లే క్రమంలో లూప్ లాక్ తెగిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ట్రైన్ ఆగి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.