
హైదరాబాద్, వెలుగు: బెట్టింగ్ యాప్ కేసులో టీవీ యాంకర్ శ్యామలకు హైకోర్టులో ఊరట లభిం చింది. బెట్టింగ్ యాప్ల ప్రచారం చేశారనే అభియోగాలపై ఇప్పటికే ఉన్న కేసునే పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగించాలని పోలీ సులకు ఉత్తర్వులు జారీ చేసింది.
అదే అభి యోగాలపై రెండో ఎఫ్ఐఆ ర్ను రిజి స్టర్కు వీల్లేదని చెప్పింది. రెండో ఎఫ్ఐఆర్లో పిటిషనర్ను సాక్షిగా మాత్రమే పరిగణించాలంది. ఈ మేరకు జస్టిస్ తుకారాంజీ ఉత్తర్వులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్ లపై ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఎస్ఐఆర్ నమోదు చేశారు. ఇదే వ్యవ హారంపై సైబర్ క్రైమ్ పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలా చేయడాన్ని శ్యామల సవాల్ చేసిన పిటిషన్లో బుధవారం ఉత్త ర్వులు జారీ చేసిన హైకోర్టు.. వ్యాజ్యంపై విచారణను మూసివేసింది.