న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 4.9 శాతం వాటాను రూ.193.32 కోట్లకు కొననున్నట్లు ప్రకటించింది. టీవీఎస్ వేణు సంస్థ జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో వారెంట్లు, సెకండరీ పర్చేజ్ ద్వారా మొత్తం 9.9 శాతం వరకు మైనారిటీ వాటాను పొందే ఒప్పందంలో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది.
జన్ హోల్డింగ్స్ లిమిటెడ్తో జరిగిన ఈ ఒప్పందానికి టీవీఎస్ మోటార్ బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2026 మే 18 నాటికి ఉన్న పెయిడ్- అప్ షేర్ క్యాపిటల్లో 51,60,903 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తారు. ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తికానుంది. ఈ బ్యాంక్కు దేశవ్యాప్తంగా 822 ఔట్లెట్లు ఉన్నాయి.
