V6 News

బిహార్నుంచి తెచ్చి.. హైదరాబాద్ సిటీలో తుపాకులు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

బిహార్నుంచి తెచ్చి.. హైదరాబాద్ సిటీలో తుపాకులు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
  • ఇద్దరిని అరెస్ట్​ చేసిన  పోలీసులు
  • ఒక తుపాకీ, 8 రౌండ్లు, 2 ఖాళీ మ్యాగజైన్స్​ స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు: బిహార్​ నుంచి నగరానికి తుపాకీ తెచ్చి విక్రయించడానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులను శేరిలింగంపల్లి ఎస్వోటీ, పేట్​బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రం రోహతాస్​ జిల్లాకు చెందిన వికాస్​కుమార్(22), వంశరాజ్​ రామ్(31)బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి దూలపల్లిలో ఉంటూ కూలీలుగా పనిచేస్తున్నారు. 

సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వెపన్స్​ అమ్మేందుకు సిద్ధమయ్యారు. బిహార్​కి చెందిన కాజల్​ సింగ్​ నుంచి ఒక తుపాకీ కొన్నారు. రైలు మార్గం ద్వారా నగరానికి తెచ్చారు. విశ్వసనీయ సమాచారంతో శేరిలింగంపల్లి ఎస్వోటీ, పేట్​బషీరాబాద్​ పోలీసులు సోమవారం దూలపల్లిలోని వికాశ్​ ఇండియన్​ గోదాంపై దాడిచేశారు. వికాస్​కుమార్​, వంశరాజ్​ రామ్​ను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు.  ఒక 7.65 ఎం.ఎం. పిస్టల్​, 8 బులెట్లు, 2 ఖాళీ మ్యాగజైన్​లు దొరికాయి. 

వాటిని స్వాధీనం చేసుకుని ఆర్మ్​యాక్ట్​ కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. సమావేశంలో ఎస్వోటీ అడిషన్​ డీసీపీ శోభన్​కుమార్​, అడిషనల్​ డీసీపీ గోవర్థన్​, ఏసీపీ శంకర్​రెడ్డి, పేట్​బషీరాబాద్​ ఇన్​స్పెక్టర్​ విజయ వర్ధన్​ తదితరులు ఉన్నారు.