శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టుకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. రాష్ట్ర ఉద్యానవన శాఖ నిర్వహించిన ఏడో గార్డెన్ ఫెస్టివల్–2022లో ల్యాండ్ స్కేప్, ట్రాఫిక్ ఐలాండ్ మెయింటెనెన్స్ విభాగాల్లో ఎయిర్పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో అవార్డుల ప్రదానం జరిగింది. మంత్రి నిరంజన్రెడ్డి చేతుల మీదుగా ఎయిర్పోర్టు అధికారులు అవార్డులు అందుకున్నారు.