చదువుకోమంటే..ఇంట్లోంచి పారిపోయిండ్రు

చదువుకోమంటే..ఇంట్లోంచి పారిపోయిండ్రు
  • 24 గంటల్లో చిన్నారుల ఆచూకీ ఛేదించిన పోలీసులు

నేరెడ్​మెట్, వెలుగు:  మంచిగా చదువుకోవాలని లేకపోతే హాస్టల్లో వేస్తానని తల్లి మందలించడంతో ఇద్దరు చిన్నారులు ఇంట్లో నుంచి పారిపోయారు.  నేరేడ్ మెట్ పోలీసులు తెలిపిన ప్రకారం..  సంతోషిమానగర్​ కు చెందిన పుట్ట ఇందు (13), కోడూరు లకిత (6) వరుసకు అక్కాచెల్లెళ్లు.  మల్కాజిగిరి హై స్కూల్​ లో చదువుతున్న ఇందును బాగా చదువుకోవాలని తల్లి గాయత్రి ఒత్తిడి చేస్తుంది.  దీంతో లకితతో కలిసి ఇందు ఆదివారం ఉదయం జేబీఎస్ బస్టాండ్  కు వెళ్లి అక్కడి నుంచి సిద్దిపేట చేరారు.   ఇందు గతంలో సిద్దిపేటలోని బాలసదన్ లో ఉండడంతో లకితను తన వెంట తీసుకెళ్లింది. తల్లి గాయత్రి ఫిర్యాదు చేయగా  నేరెడ్​మెట్​ సీఐ నాగరాజు దర్యాప్తు చేపట్టగా పిల్లలు  బాలసదన్​లో ఉన్నట్లు గుర్తించారు. సోమవారం తల్లిదండ్రులకు చిన్నారులను అప్పగించారు.