భీమదేవరపల్లి మండలంలో .. దిగబడిన లారీలు నిలిచిన ట్రాఫిక్

భీమదేవరపల్లి మండలంలో .. దిగబడిన లారీలు నిలిచిన ట్రాఫిక్

భీమదేవరపల్లి, వెలుగు : భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులోని హైవేపై మంగళవారం రెండు లారీలు దిగబడిపోయాయి. ప్రస్తుతం సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు నేషనల్​హైవే నిర్మాణం జరుగుతోంది. కల్వర్టులు నిర్మించిన చోట కేవలం కంకరతో నింపుతుండడంతో తరచూ వెహికల్స్​దిగబడుతున్నాయి.

తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ఇలాగే రెండు లారీలు ఇరుక్కుపోయాయి. ట్రాఫిక్​స్తంభించింది. దీంతో హనుమకొండ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వెహికల్స్ గోపాల్​పూర్ వైపు మళ్లించారు.