భూ తగాదాలతో ఇద్దరి సూసైడ్​

భూ తగాదాలతో ఇద్దరి సూసైడ్​
  •  పురుగుల మందు తాగిన తల్లి, కుమార్తె 

  • గద్వాల జిల్లాలో విషాదం ఘటన


హైదరాబాద్‌ : గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  భూ తగాదాలు, కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు సూసైడ్​ చేసుకున్నారు.   జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల పరిధిలోని ఏ -బుడిదపాడు  గ్రామానికి చెందిన మాల నరసింహులు(45) తన భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18)తో కలిసి ఉంటున్నాడు.  కాగా గత కొన్ని రోజులుగా నరసింహులుకు తన అన్నదమ్ముల మధ్య భూమి తగాదాలు, కుటుంబ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.  గొడవల కారణంగా తీవ్ర మనస్థాపం చెంది ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని నిన్న సాయంత్రం ఇంట్లోనే పురుగుల మందు  తాగారు.

 వరలక్ష్మి, అనురాధ పరిస్థితి తీవ్రంగా ఉండడంతో  స్థానికులు కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే తల్లి,కూతరు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. నరసింహులు మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని భావించినా పురుగుల మందు తాగలేకపోయాడని,  తన కళ్ల ముందు భార్య కూతురు చనిపోవడంతో కుప్ప కూలిపోయాడని స్థానికులు తెలిపారు. వరలక్ష్మి,అనురాధ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు