ఎయిర్ పోర్టులో .. 892 గ్రాముల బంగారం సీజ్

ఎయిర్ పోర్టులో .. 892 గ్రాముల బంగారం సీజ్
  • ఇద్దరు ప్యాసింజర్లు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు ప్యాసింజర్లను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఇద్దరు వేర్వేరు ప్యాసింజర్ల లగేజీని అధికారులు తనిఖీ చేశారు.

ఒకరి నుంచి 134 గ్రాములు, మరొకరి నుంచి 757 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 892 గ్రాముల బంగారం పట్టబడగా.. దీని విలువు సుమారు 54 లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.