రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్:  ఎంజీబీఎస్ బస్ ‌స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడ్డారు. ఎదురుగా వస్తున్న లారీ బైక్ పై నుండి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు చాదర్ ఘాట్‌కు చెందిన‌ మోసిన్ ఖాన్, ఫసీ ఖాన్‌గా గుర్తించారు.