వర్షానికి ఇళ్లు కూలి ఇద్దరు మహిళలు మృతి

వర్షానికి ఇళ్లు కూలి ఇద్దరు మహిళలు మృతి

హైదరాబాద్ : పాత బస్తీ హుస్సేని ఆలంలో ప్రమాదం జరిగింది. వర్షానికి  పాత రేకుల ఇళ్లు కూలి ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో ఇళ్లును పూర్తిగా కూల్చివేస్తున్నారు సహాయక సిబ్బంది. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.